ఖమ్మంలో రూ.7 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఏపీ పబ్లిక్ న్యూస్ : ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం వీవీ పాలెంలో సోమవారం రూ.7 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం నగరంలోని పుట్టకోటకు చెందిన నవీన్ అనే వ్యాపారి వివి పాలెం వద్ద అద్దె ఇంట్లో గుట్కా ప్యాకెట్లను నిల్వ చేసినట్లు స్థానిక ఎస్ఐ ఎం.రవి తెలిపారు.
పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేశారు.