టీడీపీ శ్రేణులుతో నేడు రేపు చంద్రబాబు సమావేశాలు

టీడీపీ శ్రేణులుతో నేడు రేపు చంద్రబాబు సమావేశాలు



ఏపీ పబ్లిక్ న్యూస్ : అమరావతి

అమరావతి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళ, బుధవారాలు పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు. ఈ రెండు రోజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీ కానున్నారు.