ఒకటే రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం

ఒకటే రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం

ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు నియోజకవర్గం

నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వర రావు అధ్యక్షతన ఒకటే రాజధాని అమరావతి రాజధాని అనే నినాదంతో సర్కార్ వారికి వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఆ రైతులు అమరావతి రాజధానిగా ఉండాలని మహా పాదయాత్ర చేస్తున్నారు వారికి సంఘీభావంగా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా మద్దతు ప్రకటించి పాదయాత్ర రైతులకు స్వాగతం పలికి వారితో పాదయాత్ర కొనసాగించిన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు చిన్నం మురళీకృష్ణ, పెరవలి మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణరావు, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు అగర్వాల్ హీరాలాల్, పెచ్చేటి కోటేశ్వరరావు, మహిళా నాయకురాలు పడాల అచ్యుత, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్, సీనియర్ నాయకులు జీవి సత్యనారాయణ, నిడదల పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసీం, పుచ్చకాయల వరప్రసాద్, అధికారుల బలరాం, కాకి కిషోర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కారింకి వెంకట నాగేంద్రబాబు, గుర్రం రమేష్, పగళ్లపాటి భాస్కర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.