వ్యంగ్య పోస్టులతో వైసీపీ సర్కార్ కు పవన్ చురకలు

వ్యంగ్య పోస్టులతో వైసీపీ సర్కార్ కు పవన్ చురకలు


ఏపీ పబ్లిక్ న్యూస్ : విశాఖపట్నం

విశాఖపట్నం: ట్వీట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యంగ్య పోస్టులతో జగన్‌రెడ్డి సర్కార్‌కు పవన్‌ చురకలు అంటించారు. చల్లగాలి కోసం ఆర్కే బీచ్‌కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా? అంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఉడతా..ఉడతా.. ఊచ్‌ అంటూ ప్రాసలు పోస్ట్‌ చేసిన పవన్‌, ఉడతా..ఉడతా.. ఊచ్‌, ఎక్కడికెళ్తావోచ్‌.. రుషికొండ మీద జామపండు కోసుకొస్తావా?.. అంటూ ట్వీట్ చేశారు. మా వైసీపీకి ఇస్తావా?, మా థానోస్‌ గూట్లో పెడతావా అంటూ పవన్‌ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

ట్విటర్‌లో పవన్ కళ్యాణ్ వీడియో పోస్ట్ పెట్టారు. ప్రముఖ సీఎం నాయకత్వంలో మన ప్రియతమ ఏపీ పోలీసులు అంటూ ట్వీట్ చేశారు. తనను జనసేన కార్యక్రమాలు, ర్యాలీలు,.. సమావేశాలు నిర్వహించకూడదని నిషేధించారు. తన గది కిటికీ నుంచి ఈ దృశ్యాన్ని మాత్రమే తనకు అందించారని తెలిపారు. హోటల్ బయట వేచి ఉన్న అభిమానుల వీడియో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. విశాఖ పోలీసుల తీరుపై పవన్ మరో వ్యంగ్య పోస్ట్ చేశారు. తన గది కిటికీలోంచి పలకరించవద్దని, ఏపీ పోలీసులు తనకు చెప్పరని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.