" ఆదిపురుష్ '' విడుదల ఆపాలంటూ కోర్టులో పిటిషన్
" ఆదిపురుష్ '' చిత్రం విడుదల వాయిదా పడనుందా?
ఏపీ పబ్లిక్ న్యూస్ : సినిమా
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ''ఆదిపురుష్'' తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. భారీ విజువల్ వండర్గా ఐదువందల కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఐమాక్స్, 3డీ వెర్షన్స్ లో విడుదల కాబోతుంది.
`ఆదిపురుష్` టీజర్ అనేక విమర్శలను ఎదుర్కొంది. వీఎఫ్ఎక్స్ విషయంలో దారుణమైన ట్రోల్స్ కి గురైంది. క్రిటిక్స్ నుంచి, అభిమానుల వరకు `ఆదిపురుష్` టీజర్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నెగటివ్ కామెంట్లు సోషల మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయినా కూడా యూట్యూబ్లోనూ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన వీడియోగా ఇది రికార్డు సృష్టించింది.
ఇప్పుడు ఈ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ చిత్రంలో రాముడు, హనుమంతుడు పాత్రలు తోలు తో చేసిన దుస్తులు ధరించారని, రావణుని పాత్ర సరైన విధంగా చిత్రీకంచలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామాయణాన్ని వక్రీకరించే విధంగా ఉందని పిటిషనర్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆది పురుష చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.