సమంత చైతుని రెచ్చగొడుతోందా? సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుందా?

సమంత చైతుని రెచ్చగొడుతోందా? సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుందా?


ఏపీ పబ్లిక్ న్యూస్: సినిమా 

ఏదో తీరని పగ, వివాదం సమంత చైతూ మధ్య నడుస్తుంది. దానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ముఖ్యంగా సమంత చైతూపై తన కోపాన్ని నేరుగానే చూపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తుంది. విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నాక కూడా ఈ ప్రతీకారాలు ఎందుకనేది అర్థం కావడం లేదు. నాగ చైతన్య-సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన పరిశ్రమలో ఉంది. తమ తమ పీఆర్వోల చేత ఒకరిపై మరొకరు దుష్ప్రచారం చేయిస్తున్నారట. విడాకులు తర్వాత సమంతపై వచ్చిన ఆరోపణలన్నింటికీ నాగ చైతన్యనే కారణమని సమంత గట్టిగా నమ్ముతున్నారు. చైతూ మౌనం నటిస్తూనే తెరవెనుక ఉండి అవన్నీ చేయించాడనేది ఆమె ఆరోపణ. పీఆర్వోలతో మీడియాకు లీకులిచ్చి చైతన్య దుష్ప్రచారం చేయించాడని సమంత మనసులో బలంగా నాటుకుపోయింది. అదే సమయంలో నాగ చైతన్య టీమ్ సేమ్ ఆరోపణలు సమంతపై చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్యకు ఎఫైర్ అంటూ.. ఒక వార్త చక్కర్లు కొట్టింది.

నాగ చైతన్య-శోభిత ప్రేమాయణం సాగిస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇది సమంత పనే, ఈ పుకార్లు ఆమె పుట్టించారని చైతూ టీం ఆరోపించారు. దీనిపై సమంత స్పందించడం విశేషం. ఒక అమ్మాయిపై వచ్చిన పుకార్లు నిజం, అదే అబ్బాయిపై వచ్చిన పుకార్లు మాత్రం ఎవరో సృష్టించినవా? అంటూ ఆమె  చేశారు. సమంత, చైతూ మధ్య వార్ నడుస్తూనే ఉందని ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి, తాజాగా సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. సదరు పోస్ట్ తో నాగ చైతన్యను ఆమె రెచ్చగొట్టారు అనిపిస్తుంది. యు విల్ నెవర్ వాక్ అలోన్… అనే ఇంగ్లీష్ కోట్ రాసున్న తన టీషర్ట్ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఇంగ్లీష్ కోట్ ని అనువదిస్తే… ఒంటరిగా జీవించడం నీ వల్ల కాదు, అని. ఇక్కడ నాగ చైతన్యను సమంత తోడు లేకుండా బ్రతకడం నీ వల్ల కాదని ఎద్దేవా చేస్తున్నట్లుంది. సమంత చేసిన ఆ సోషల్ మీడియా పోస్ట్ చైతూపై సెటైరే అంటున్నారు. ఈ క్రమంలో సమంతకు చైతూ అంటే అంత కోపం ఎందుకనే వాదనలు మొదలయ్యాయి. కెరీర్ పరంగా చూస్తే ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు.