దుష్టచతుష్టయ దుష్పచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి

దుష్టచతుష్టయ దుష్పచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి


ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు నియోజకవర్గం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు దుష్టచతుష్టయ దుష్పచారాన్ని సమర్థవంతంగా సోషల్‌మీడియాలో తిప్పికొట్టాలని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు గారు సూచించారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా నిడదవోలు నియోజకవర్గ కన్వీనర్‌గా దల్లి కనకేష్‌రెడ్డి, కో–ఆర్డీనేటర్‌లుగా చిట్టూరి జగదీష్‌ చౌదరి, తోట సురేష్, అబి కిషోర్, ఎండీ ఇమ్రాన్‌లు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడి గారిని ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిడదవోలు సోషల్‌ మీడియా సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడి గారిని 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేలా బాధ్యతగా పనిచేస్తామన్నారు.