ప్రతిభ గల విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన చందన నాగేశ్వర్

ప్రతిభ గల విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన చందన నాగేశ్వర్  

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

విద్యలో మంచి ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కడియపులంక గ్రామానికి చెందిన వర్రె మణికంఠ కు ఆర్ధిక సహాయమును రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అందజేశారు.

వర్రె మణికంఠ కడియపులంక గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసి 540/600 మార్కులుతో విద్యలో మంచి ప్రతిభ కనబరిచాడు. ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరము విద్యను అభ్యసిస్తున్నారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ బుధవారం నాడు ఆయన కార్యలయంలో వర్రె మణికంఠ అనే విద్యార్థికి ఆర్థిక సహాయమును అందించారు.