జనసేన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది

జనసేన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది

పొడగట్లపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి రమ్య చికిత్స నిమిత్తం అర్థిక సహాయం అందించిన పొడగట్లపల్లి జనసేన పార్టీ


ఏపీ పబ్లిక్ న్యూస్ : కొత్తపేట నియోజకవర్గం

రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి రమ్య (దుర్గ) ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వారు కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చూపుని కొల్పొయారు. తిరిగి చూపు రావడం కోసం ఆపరేషన్ నిమిత్తం పొడగట్లపల్లి జనసేన పార్టీ తరుపున 35000 రూపాయలు సమీకరించి ఈ రోజు వారి కుటుంబ సభ్యులు పితాని సత్యం, కృష్ణవేణి గార్లకు కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారి చేతులు మీద సహయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట స్వామి, కేబుల్ రాము, వీటి రాజు, జనిపిరెడ్డి సూరిబాబు, దాసిరెడ్డి జనార్థన్, భూపతిరాజు శ్రీనివాస్ రాజు, గండి శ్రీను, కొండేపర్తి శ్రీను, అంకాలక్ష్మీ, ముళ్లపూడి శివ కుమారి, చొక్కా రాజేష్, పులగం ప్రసన్న కుమార్, కాపవరపు వీరబాబు, బొక్కా గోవింద్, ఠాణేలంక చిన్న స్వామి, వీటి పవన్ కళ్యాణ్, కాపవరపు వీరబాబు, యర్రంశెట్టి బాబి, కెవి సత్యనారాయణ, తదితర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.