జగన్ ప్రకటనలు మాని నిందితులకు శిక్షపడేలా చూడాలి:చంద్రబాబు

జగన్ ప్రకటనలు మాని నిందితులకు శిక్షపడేలా చూడాలి:చంద్రబాబు


ఏపీ పబ్లిక్ న్యూస్ : అమరావతి

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. మహిళలపై నేరాల కట్టడిలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని చంద్రబాబు మండిపడ్డారు.కాకినాడలో దేవిక హత్యపై సీఎం ప్రకటన మోసపూరితమని, దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలనడం మోసగించడమే అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఉత్తుత్తి ప్రకటనలు మాని నిందితులకు శిక్షపడేలా చూడాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉన్న చట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని, నేరాల అదుపులో వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్లే ఘోరాలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు