జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం


ఏపీ పబ్లిక్ న్యూస్ : జాతీయం

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న కాల్పుల్లో మరో ఉగ్రవాది హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారని, ఆపరేషన్‌ కొనసాగుతోందని కశ్మీర్ జోన్‌ పోలీసులు సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు.