ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతే- బండారు సత్యానందరావు

ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతే- బండారు సత్యానందరావు.

అమరావతి రైతుల మహాపాదయాత్రకు రూ.2,60,000 విరాళం


ఏపీ పబ్లిక్ న్యూస్ : కొత్తపేట నియోజకవర్గం 

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అరసవల్లి వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులకు, మహిళలకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన రైతులు అండగా నిలిచారు. అమరావతి ఉద్యమానికి తమ వంతు సాయంగా మొత్తం 2లక్షల అరవైవేల రూపాయలను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారి చేతుల మీదుగా అమరావతి జె.ఏ.సికి అందజేశారు. ఈ మొత్తంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగు కార్మిక విభాగం అధ్యక్షుడు తాడి శ్రీనివాసరెడ్డి, ఆలమూరు మండల తెలుగు రైతు అధ్యక్షుడు గొడవర్తి బాబి చెరొక 50వేల రూపాయల విరాళాన్ని అందించగా మడికి తెదేపా నాయకులు 25వేల రూపాయలు, అంకంపాలెం రైతు సోదరులు 75వేల రూపాయలు, పేరవరం గ్రామ తెదేపా నాయకులు, రైతులు 50వేల రూపాయలు, చింతలూరు రైతులు 10వేల రూపాయలు మొత్తం రూ.2లక్షల 60వేలను జె.ఏ.సి నేతలకు బండారు చేతుల మీదుగా అందించారు.

యాత్రలో పాల్గొనడానికి ముందు బండారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమరావతి రైతుల యాత్ర ఏ ఒడిదుడుకులు లేకుండా అరసవల్లి చేరాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి ఆశీర్వాదానికి చిహ్నంగా యాత్రలో పాల్గొంటున్న రైతులకు 2వేల మందికి సరిపడా పులిహోర, చక్కెర పొంగలి ప్రసాదాలను అందజేశారు. యాత్రలో పాల్గొన్న బండారు ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుందని, నాడు దేవతల రాజధాని అమరావతిని కొన్నాళ్ళు రాక్షసులు చుట్టుముట్టి అంధకారంలో నెట్టిన మాదిరిగానే నేడు ఆంధ్రుల కలల రాజధానిని సైతం వైకాపా కాలకేయులు అంధకారంలోకి నెట్టారని వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపుతో అమరావతికి, ఆంధ్రప్రదేశ్ కి తిరిగి నూతన కాంతి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా శ్రేణులు, రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.