పాలీ టెక్ ఫెస్ట్ 2022 కార్యక్రమం - ముఖ్యఅతిథిగా హోం శాఖ మంత్రి తానేటి వనిత

పాలీ టెక్ ఫెస్ట్ 2022 కార్యక్రమం - ముఖ్యఅతిథిగా హోం శాఖ మంత్రి తానేటి వనిత



ఏపీ పబ్లిక్ న్యూస్ : విజయవాడ

విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన పాలీ టెక్ ఫెస్ట్ 2022 కార్యకమనికి హోం శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు నాగరాణి, ఇన్ఫోసిస్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్, పద్మారావు, విజయ భాస్కర్, సత్యనారాయణ, నిర్మల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హోంమంత్రి వనిత గారు నగదు ప్రోత్సహకాలను బహుమతులుగా అందించారు. మార్కులు తెచ్చుకోవడమే విద్యా భాస్యం కాదని.. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవడమే నిజమైన విద్య అని హోం మంత్రి తానేటి వనిత గారు పేర్కొన్నారు.