రాజ్యాంగ దినోత్సవ వేడుకలు - ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు - ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత


ఏపీ పబ్లిక్ న్యూస్ : రాజమహేంద్రవరం

రాజమండ్రి లోని సుబ్రహ్మణ్యం మైదానంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు హోం శాఖ మాత్యులు తానేటి వనిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని హోమంత్రి స్పష్టం చేశారు. దళితులకు సముచిత స్థానం కల్పించి గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని హోం మినిస్టర్ తానేటి వనిత కొనియాడారు.