చంద్రబాబు పర్యటన విజయవంతం చెయ్యండి - కుందుల సత్యనారాయణ

చంద్రబాబు పర్యటన విజయవంతం చెయ్యండి..

ప్రజలకు సేవచెయ్యడానికి ఒక ప్రజా ప్రతినిధిగా ఉండాలని టికెట్ ఆశిస్తున్న

టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాము

ఎవరెన్ని ప్రలోభ పెట్టిన తెలుగుదేశం పార్టీతోనే పయనం

అందరి కృషి టీడీపీ విజయం కోసమే 

సృష్టం చేసిన కుందుల సత్యనారాయణ

ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు నియోజకవర్గం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తొలగాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టీడీపీ అధికారంలోకి రావడం తప్పనిసరని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ అన్నారు. నిడదవోలులో పాత్రికేయుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఆరాచకపాలన పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన "ఇదేం కర్మ రాష్టానికి" కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్చారు. డిసెంబర్2న నిడదవోలులో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.


టిక్కెట్ ఎవరికి ఇచ్చిన విజయానికి సమిష్టిగా కృషి చేస్తాము:

నిడదవోలు టీడీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కుందుల సత్యనారాయణ స్పందిస్తూ నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రజలకు సేవచెయ్యడానికి ఒక ప్రజా ప్రతినిధిగా ఉండాలని టికెట్ ఆశిస్తున్నట్లు తెలియచేసారు. అధినేత నాకు టికెట్ ఇచ్చిన వేరొకరికి ఇచ్చిన అందరూ కలిసి కట్టుగా టీడీపీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చెయ్యడం మనందరి బాధ్యత అన్నారు. అధినేత అభ్యర్థిని ప్రకటించే వరకు ఆశావహులు ఎవరి ప్రయత్నం వారు చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని అందరూ ఒక్కటిగా సమిష్టి కృషితో గెలిపించుకుంటామన్నారు. టీడీపీ లో ఉన్న వారందరది ఒకటే కుటుంబం అని, రాష్ట్ర ప్రయోజనం, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చెయ్యడమే మా అందరి లక్ష్యం అన్నారు. ఈ సమావేశం లో కుందుల సత్యనారాయణ తో పాటు అతని మద్దతుదారులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.