దివ్యాంగులకి క్రికెట్ కిట్ ను అందించిన చందన నాగేశ్వర్
ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రి రూరల్ కోఆర్డనేటర్ చందన నాగేశ్వర్ ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్ ను అందించారు.
డిసెంబర్ నెలలో జరిగే ఉమాంగ్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ భోపాల్ లో జరగనుంది. ఈ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ జట్టు పాల్గొనుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, వారి విజయంతో రాష్ర్టానికి మరింత పేరు తీసుకురావాలని తెలిపి వారికి క్రికెట్ కిట్ ను అందించి వారికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ టీమ్ ప్రెసిడెంట్ ఏ.మల్లేశ్వరరావు, కెప్టెన్ ఎం.ప్రవీణ్ కుమార్, వైస్ కెప్టెన్ కె. తాతాజీ తదితరులు పాల్గొన్నారు.