తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ఏపీ పబ్లిక్ న్యూస్ : విజయవాడ
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, హోం శాఖ మాత్యులు తానేటి వనిత, ఇతర మంత్రులు, వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.