కందుకూరు దుర్ఘటన బాధిత కుటుంబాలకు కుందుల సత్యనారాయణ రూ.4 లక్షల ఆర్థిక సాయం

కందుకూరు దుర్ఘటన బాధిత కుటుంబాలకు కుందుల సత్యనారాయణ రూ.4 లక్షల ఆర్థిక సాయం

ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : కందుకూరులో జరిగిన దుర్ఘటనలో మరణించిన టిడిపి కార్యకర్తలకు నిడదవోలు నియోజకవర్గ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ప్రగాఢ సానుభూతి, నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన కందుకూరు ఘటన రాజకీయం చేయడం సరి కాదని అన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి వనిత, వైసిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కందుకూరు టిడిపి కార్యకర్తల మృతి బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన వంతు సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున రూ.4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.