ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్‌ జట్టును అభినందించిన చందన నాగేశ్వర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్‌ జట్టును అభినందించిన చందన నాగేశ్వర్



ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

డిసెంబర్ నెల మొదటి వారంలో భోపాల్ లో జరిగిన ఉమాంగ్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ జట్టు ఫైనల్స్ వరుకు చేరుకుని రన్నర్ అప్ జట్టుగా గెలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ట్రోఫీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ జట్టు గెల్చుకుంది. 

ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్ రన్నర్ఆప్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ జట్టు సభ్యులను అభినందించారు. ఇదే ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగాలని నా సహకారం ఎప్పుడు మీకు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీల్ చైర్ క్రికెట్ టీమ్ ప్రెసిడెంట్ ఏ.మల్లేశ్వరరావు, కెప్టెన్ ఎం.ప్రవీణ్ కుమార్, వైస్ కెప్టెన్ కె. తాతాజీ, హితకరణి సమాజ్ డైరక్టర్ సరిత రాణి, పెన్నడ లక్ష్మీ, దేవి, పట్టపగలు లక్ష్మీ, సఫారీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.