విజ్జేశ్వరం క్రుపా ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విజ్జేశ్వరం క్రుపా ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 




ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు మండలం, విజ్జేశ్వరం గ్రామం లో క్రుపా ప్రార్థన మందిరం బిషప్ రెవ. కిరణ్ ఇర్లపాటి ఆల్ ఇండియా క్రిష్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆద్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ డైనమిక్ స్పీకర్ బ్రదర్ నాని బాబు, CBT ప్రిన్సిపాల్ మాదేపల్లి, గ్రామ సర్పంచ్ తిక్కా శ్రీను, జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, కోరుపల్లి, మునిపల్లె గ్రామాల దైవ శేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ రెవ. కిరణ్ ఇర్లపాటి మాట్లాడుతూ వచ్చిన అతిథులను ఉద్దేశించి వారిని స్థానిక ప్రజలకు పరిచయం చేస్తూ వారి ప్రాముఖ్యతను వివరించారు.  మొదటిగా జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు ఉద్దేశించి ఈమధ్య సేవకులమీద జరుగుతున్న అకృత్యాలు, చర్చ్ లమీద జరుగుతున్న దాడులగురించి మాట్లాడాలన్న, నిలదీయాలన్నా చోళ్ళ రాజు ముందుంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేదికమీద ఉన్న అతిథులు వారి విలువైన సందేశం ఇచ్చారు. బాల బాలికలు వాక్యాలు, పాటలు, నాటికలు తో ఎంతో ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకను నిర్వహించారు.