జైభీమ్ భారత్ పార్టీ అధినేతను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దళిత నాయకులు

జైభీమ్ భారత్ పార్టీ అధినేతను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దళిత నాయకులు


ఏపీ పబ్లిక్ న్యూస్, విజయవాడ : రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్న దాడులను ప్రజాక్షేత్రంలోనే కాకుండా న్యాయస్థానాల ద్వారా నిలదీస్తూ పోరాటం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలనే కాకుండా కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి మనిషిని ఆలోచింప చేస్తూ ప్రతి మనిషికి ఆదర్శవంతమైన జైభీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ని పార్టీ ప్రధాన కార్యాలయం విజయవాడ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ నాయకులు జైభీమ్ దళిత ప్రజావేదిక అధ్యక్షులు చోళ్ళ రాజు, దారవరం మాజీ సర్పంచ్ గూటం వెంకటేష్, చౌదరి, జై భీమ్ భారత్ పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇంచార్జ్ పళ్లెం సురేంద్ర, తదితరులు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.