శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు

శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు


ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు ఎమ్మెల్యే కార్యాలయంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, పట్టణ కౌన్సిలర్స్, పట్టణ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.