ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయం - రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి

ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయం -  రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి



ఏపీ పబ్లిక్ న్యూస్, రాజమండ్రి : ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయమని రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని స్థానిక రాజమండ్రి చర్చ్ పేట సెయింట్ పాల్స్ లూధరన్ చర్చ్ లో పాస్టర్ బాపనయ్య ఆహ్వానం మేరకు రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి క్రిస్మస్ వేడుకలకు, క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ లో పాల్గొన్నారు. ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి హృదయం కలిగి ఎదుటి వారికి సాయం చేసినప్పుడే ఆ దేవుని ఆశీస్సులు వారి మీద ఉంటాయన్నారు. క్రీస్తు బోధనలు ద్వారా ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్నారు. ఆయన సూచించిన శాంతి, కరుణ, ప్రేమ మార్గాలను అనుసరించడం ద్వారా ఉన్నతంగా జీవించగలం అన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా సంఘ విశ్వాసకులు తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రైస్తవులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.