ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్
నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ బూరుగుపల్లి శేషారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి నివాళ్ళులు అర్పించారు అనంతరం పెరవలి గ్రామంలో వైసిపి పార్టీ నుండి పెద్ద ఎత్తున్న ముస్లింలు బి.సి లు యస్.సి సామాజిక వర్గాల నుండి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం పెరవలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు.