జక్కంపూడి విజయలక్ష్మి కోలుకోవాలని సాయిబాబా గుడిలో పూజలు

జక్కంపూడి విజయలక్ష్మి కోలుకోవాలని సాయిబాబా గుడిలో పూజలు



ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

రాజమహేంద్రవరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆధ్యాత్మిక సేవా పరురాలు, సామాజిక సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నటరాజ్ థియేటర్ వద్ద ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో వైకాపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రి పార్టీ నాయకులు పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టి హారతి ఇచ్చారు. భగవంతుని ఆశీస్సులతో అమ్మ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో పొంది తిరిగి ప్రజలకు, పార్టీకి సేవ చేయడానికి వస్తారని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 36 వ వార్డు వైకాపా ఇంచార్జీ గుంటముక్కల రాజు, దుద్దుపూడి త్రినాధ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డాక్టర్ లంక సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, బొంత శ్రీహరి, మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడపా అనిల్, బూరాడ భవానీ శంకర్, నరవ గోపాలకృష్ణ, కోడి కోట, బురిడి త్రిమూర్తులు, కురుమిల్లి స్వరూప్, బూడిద శరత్ కుమార్, మేడబోయిన సునీల్, వంకాయల సత్తిబాబు, మాసా రామ్ జోగ్, అడపా రాజు, పెదిరెడ్ల శ్రీనివాస్, రాయవరపు గోపాల కృష్ణ,కాటం రజనీకాంత్, మోతా సుభాష్, ఆశపు మల్లిబాబు, ఉప్పాడ కోటారెడ్డి, పాలూరి శ్రీను, ఆశపు సత్యనారాయణ, పోలాకి శ్రీను, గుళ్ళ సునీల్, మాకిరెడ్డి దొరబాబు, టి.రాజేష్, వెలుగు కొండ సూర్యకిరణ్, సాధనాల విశాఖ ,కొయ్యన పెద్దిరాజు, గౌస్ ఖాన్, లంక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.