కేరళ రాష్ట్ర మంత్రి కామ్రేడ్ రాధాకృష్ణన్ కలిసిన జువ్వాల రాంబాబు

కేరళ రాష్ట్ర మంత్రి కామ్రేడ్ రాధాకృష్ణన్ కలిసిన జువ్వాల రాంబాబు


ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు

            బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ లో జరుగుతున్న అఖిలభారత మహాసభలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుల వివక్ష వ్యతిరేక సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్ఎంఎం జాతీయ అధ్యక్షులు, కేరళ రాష్ట్ర మంత్రి కామ్రేడ్ రాధాకృష్ణన్ ను కలిశారు. 

ఈ సందర్భంగా ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోసం మహాత్మా పూలే అంబేడ్కర్ పెరియార్ సుందరయ్య ఆశయ సాధనకు దేశవ్యాప్తంగా సామాజిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కోసం దళిత శోషణ ముక్తి మంచ్ (DSMM) పోరాటం చేస్తుందని, ఈ మహాసభలలో పాల్గొనేందుకు తనను ఎంపిక చేయడంపై జువ్వల రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు.