రాజమండ్రి ఫెయిత్ ప్రేయర్ చర్చి లో క్రిస్మస్ వేడుకలు

రాజమండ్రి ఫెయిత్ ప్రేయర్ చర్చి లో క్రిస్మస్ వేడుకలు



ఏపీ పబ్లిక్ న్యూస్,  రాజమండ్రి రూరల్
: కడియం మండలం కడియపులంక గ్రామంలో దోసలమ్మ కాలని నందు క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఫెయిత్ ప్రేయర్ చర్చి లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యతిథిలుగా రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, కడియం మండలం అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు, చందన నాగేశ్వర్ మాట్లాడుతూ క్రైస్తవ మతస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సాహాల మధ్య క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎం. పరంజ్యోతి, వైఎస్సార్సీపీ నాయకులు ఈలి గోపాలం, గండి రమణ, బొడపాటి మూర్తి, కోసి సూర్యనారాయణ, రంబాల దుర్గారావు, పీతల చిన్ని, పంతం నాగేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, కందకం అర్జున్, లోవరజు, గాడి శ్రీను, బొరుసు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.