ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ది చెబుతారు - మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ

ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ది చెబుతారు

మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ 



ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో దేవినగర్ రోడ్డు నందు సుమారు 40 లక్షలతో సిసి రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. జగన్ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది పనులను చేస్తూ వస్తుందని, ప్రతిపక్షంగా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, 2024 ఎలక్షన్ లో ప్రజలే వారికి బుద్ది చెబుతారని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, కామిశెట్టి వెంకట సత్యనారాయణ, కొత్తపల్లి సుప్రియ, గాజుల రంగారావు, కొండబాబు, మహిళా అధ్యక్షురాలు కొండపల్లి సత్య, పార్టీ ఇంచార్జి కోర రామకృష్ణ వార్డు నాయకులు, ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.