కందుకూరు ఘటన బాధాకరం - మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు

కందుకూరు ఘటన బాధాకరం 

చంద్రబాబు సభకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించకపోవడమే ప్రమాదానికి కారణం

మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు



ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : కందుకూరులో ప్రమాదవశాత్తూ మరణించిన టిడిపి కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు టిడిపి కార్యాలయంలో గురువారం ప్రమాదవశాత్తు మరణించిన టిడిపి కార్యకర్తలకు నివాళులర్పించారు. ప్రమాదవశాత్తు జరిగిన కందుకూరు ఘటన రాజకీయం చేయడం సరి కాదని కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమని రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి అన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి వనిత, వైసిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు సభకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కందుకూరు టిడిపి కార్యకర్తల మృతి బాధాకరమని గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకట్రావు అన్నారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, పేరూరు సాయిబాబా, అబ్బిశెట్టి సత్తిరాజు, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.