ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి

ప్రజల కష్టాలు తీరాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావు


ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ప్రతీ ఇంటికి తిరిగి ప్రజలు వైసిపి ప్రభుత్వం వల్ల ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల కష్టాలు పోవలన్న, రాష్ట్రం అభివృద్ది జరగాలన్న తెలుగుదేశం అధికారంలోకి రావాలని, ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామకృష్ణమ్మ (శ్రీను), నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.