జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్

జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు, నిడదవోలు పట్టణం మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ సూచనలతో జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం 24 వార్డు ప్రజలకు, స్వయం సహాయక సంఘాలు మహిళలకు వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు చెత్తను ఇచ్చేటప్పుడు తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, వేరు చేసి ఇవ్వాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం భాగంగా ముఖ్య అతిథిగా నిడదవోలు పట్టణం మున్సిపల్ కమిషనర్ KV పద్మావతి రావడం జరిగింది. 24 వార్డు కౌన్సిలర్ మానుపాటి లక్ష్మి, 1వ వార్డ్ కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, 10 వార్డ్ కౌన్సిలర్ ఆరుగాల్లు వెంకటేశ్వరరావు, శానిటేషన్ సెక్రటరీలు, వార్డు వాలంటీర్స్ పాల్గొన్నారు