జనసైనికులకు పార్టీ అండగా ఉంటుంది

జనసైనికులకు పార్టీ అండగా ఉంటుంది

జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్


ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : అంబేడ్కర్ కోనసీమ జిల్లా 

జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యునిగా నమోదు చేయించుకోవడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన గండేపల్లి జనసైనికుడు మర్రి రమణ రైసు మిల్లులో పని చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన విషయం మన అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన చేతుల మీదుగా మర్రి రమణ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్క జనసైనికుడికి, క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు.