టిట్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి - తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ డిమాండ్

టిట్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలి - తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ డిమాండ్



ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : టిట్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలని తీరుగూడెంలో నిరసన చేపట్టిన తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో గృహాలను ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు దక్కకుండా శిలావస్థకు చేరేలా చేస్తుందని, తెలుగుదేశం పార్టీ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని ధ్యేయంతో నిరుపేదల కోసం టిట్కో గృహాలను నిర్మించారని వాటిని పేద ప్రజలకు ఇవ్వకుండా గత మూడున్నర సంవత్సరాల నుండి ఈ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని నిడదవోలు తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే గృహాలను మంజూరు చేసి లబ్దాలకు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన నిరసనలు సైతం నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ కేవీ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.