తెలుగుదేశం నాయకులు కుందుల ఆధ్వర్యంలో 15 వ రోజు సామూహిక నిరాహార దీక్ష

తెలుగుదేశం నాయకులు కుందుల ఆధ్వర్యంలో 15 వ రోజు సామూహిక నిరాహార దీక్ష


ఏపీ పబ్లిక్ న్యూస్ : సెప్టెంబర్ 27, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో సామూహిక నిరాహార దీక్షలు తెలుగుదేశం సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పెరవలి మండలం, ముక్కామల NH-16 నల్లాకులవారిపాలెం గ్రామంలో 15వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా కుందుల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు మన తెలుగుదేశం అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, జగన్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేసారని, రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.