టిడిపి నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మోత మోగింది కార్యక్రమం

టిడిపి నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మోత మోగింది కార్యక్రమం

డంకాలతో, డబ్బులతో, బైక్ హారాన్లతో దద్దరిల్లిన నిడదవోలు 





ఏపీ పబ్లిక్టి న్యూస్ : సెప్టెంబర్ 30,  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాత్రి నిడదవోలు నియోజకవర్గంలో ‘మోత మోగిద్దాం’ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. నిడదవోలు పట్టణంలో సంతమార్కెట్ సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్దకు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలాదిగా చేరుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు వివిధ పరికరాల ద్వారా మోత మోగించడంతో నిడదవోలు పట్టణం దద్దరిల్లింది. కుందుల సత్యనారాయణ స్వయంగా భారీ ఢంకాను కొడుతూ శబ్దభేరి మోగించారు. మిగిలిన టిడిపి నాయకులు, కార్యకర్తలు డప్పులు మోగిస్తూ, విజిల్స్, బూరలు ఊదుతూ, కార్లు, మోటార్ సైకిళ్ళ హారన్లు కొడుతూ నిడదవోలులో మోత మోగించారు. నియోజకవర్గంలో వివిధ కుటుంబాల వారు కుందుల సత్యనారాయణ పిలుపు మేరకు ఇళ్ళ నుండి బయటకు వచ్చి కంచాలు కొడుతూ మోత మోగించారు. పెరవలి, తీపర్రు, కానూరు, సమిశ్రగూడెం, ఉండ్రాజవరం తదితర గ్రామాలలో కంచాలు మోగిస్తూ, గంటలు కొడుతూ, హారన్లు మోగిస్తూ, విజిల్స్, బూరలు ఊదుతూ మోత మోగించారు.