కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి కార్యక్రమం

కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి కార్యక్రమం 


ఏపీ పబ్లిక్ న్యూస్, తీపర్రు,  అక్టోబర్ 7: నారా లోకేష్, బ్రహ్మణిల పిలుపు మేరకు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, తీపర్రు గ్రామంలో తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో చంద్రబాబుతో నేను కార్యక్రమంలో భాగంగా కాంతితో క్రాంతి కార్యక్రమం నేడు సాయంత్రం 7:00 గంటల నుంచి 7:05 నిముషాలు వరకు చేపట్టారు. అశేష ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొని కొవ్వొత్తులతో, సెల్ఫోన్ లైట్లతో,  చంద్రబాబుకు మద్దత్తు తెలియాచేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేసి  జైల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది కేవలం జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య, ఇటువంటి అక్రమ అరెస్టులతో మా అధినాయకుడిని భయపెట్టాలని చూస్తున్నారు, ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదు. మీరు ఇప్పుడు అక్రమ అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మేము అధికారంలో వచ్చాక సక్రమంగానే అరెస్టులు చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది. త్వరలోనే మా నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు అని తెలియచేసారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళామణులకు, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, కుందుల సత్యనారాయణ పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు.