ఉండ్రాజవరం మండలం, కె.సావరం గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు

ఉండ్రాజవరం మండలం, కె.సావరం గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు



ఏపీ పబ్లిక్ న్యూస్, నవంబర్ 02 : ఉండ్రాజవరం మండలం, కె.సావరం గ్రామం"గడప - గడపకు మన ప్రభుత్వం" అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.

ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామం నందు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు గడపగడపకూ తిరుగుతూ. వృద్ధులు, అక్కాచెల్లెమ్మలు, యువతతో మాట్లాడారు. అన్నా.. రైతు భరోసా సాయం అందిందా.. అవ్వా, తాత పింఛన్‌ వస్తోందా.. ఆరోగ్యం బాగుందా.. అక్కా వైఎస్సార్‌ ఆసరా.. చేయూత.. అమ్మ ఒడి డబ్బులు పడ్డాయా అంటూ అప్యాయంగా పలకరించారు. ప్రజలను సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటిలోనూ నవరత్నాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే, దృష్టికి తీసుకువచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం,మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని ఎమ్మెల్యే, తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండలం జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఎంపిపి, గ్రామ అధ్యక్షులు, గ్రామ సొసైటి అధ్యక్షులు,జిల్లా సమైక్య అధ్యక్షురాలు, గ్రామాల సర్పంచులు, సచివాలయం కన్వీనర్లు, సచివాలయం సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.