నిడదవోలులో విజయనగరం కు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడి

నిడదవోలులో విజయనగరం కు చెందిన 14 ఏండ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి

👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిడదవోలు పోలీసులు.


ఏపీ పబ్లిక్ న్యూస్, 10 ఫిబ్రవరి 2024 :

 తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ వీఆర్వోగా పనిచేస్తున్న ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో గా పనిచేస్తున్న పార్ల వెంకటరావు అనువార్లు విజయనగరానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు పిర్యాదు అందిదని, సదరు బాలికను విచారించగా నిడదవోలుకు చెందిన షేక్ అఖిలాండేశ్వరి, బండారి లలిత, దాడిశెట్టి దుర్గారావు అనువార్లు ఈ మైనర్ బాలికకు డబ్బులు ఎరగా చూపి వ్యభిచార కూపంలోకి దింపినట్లు,దీనిలో భాగంగానే ఈ మైనర్ బాలికను పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ విఆర్ఓ పార్ల వెంకటరావు అనువర్ల వద్దకు పంపి వారిని డబ్బులు అడగగా ఇవ్వని కారణంగా నిడదవోలు పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబును నిడదవోలు గణపతి సెంటర్ నందు దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్లు, సదరు మైనర్ బాలికను వ్యభిచారం కూపంలోకి దింపిన ముగ్గురు సభ్యులను, అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు విఆర్వోలపై Cr. No: 52/2024, IPC SEC 366 A, 370 A, 376 D R/W 34, 5 & 6 R/W 17/ ఫోక్స్ యాక్ట్, 5/ITP యాక్ట్ కేసులు నమోదు చేసి వీరిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విఆర్ఓ పై దాడి చేసిన దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమందిపై IPC SEC 341, 323, 506 R/W 34 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ కేసును డిఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపడతారని నిడదవోలు పట్టణ ఎస్సై పులపా అప్పారావు తెలియజేశారు