భక్త జన సంద్రోహంతో ప్రారంభమైన గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు

భక్త జన సంద్రోహంతో ప్రారంభమైన గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు. 


👉లక్షలాది భక్తులతో కిటకిటలాడిన నిర్మలగిరి 

👉భక్తుల ప్రార్థనలతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం 

2024 మార్చ్ 22, 

ఏపీ పబ్లిక్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా : 

గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలకు భక్తులను ఆహ్వానించిన పీఠాధిపతులు మోస్ట్ రెవ. డా. జయరావు పొలిమేర

గౌరీపట్నం నిర్మలగిరి మేరీమత మహోత్సవాలు మార్చ్ 22 (ఈ రోజు) నుండి ప్రారంభం అయ్యాయని, ఈ ఉత్సవాలు ఈ నెల 22,23,24,25 తేదీలలో ఘనంగా నిర్వహిస్తారని, ఈ పర్వదినాలలో లక్షలాదిగా భక్తులు నిర్మలగిరి మేరీమాతను దర్శించి ధరిస్తారని నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ & విచారణ కర్త రెవ. ఫా. యస్ జాన్ పీటర్ ఏపీ పబ్లిక్ న్యూస్ మీడియకు తెలియజేసారు.